News August 13, 2025
కరీంనగర్: ‘స్వచ్ఛ హరిత విద్యాలయ’ రేటింగ్లో పాల్గొనాలి

కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్’లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బోధన, ఇంగ్లీష్ క్లబ్ వంటి అంశాలపై ఆమె మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News August 14, 2025
KNR: అతి భారీ వర్షాలపై విద్యుత్ వినియోగదారులకు సూచనలు

ఈ నెల 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఈ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా, 87124 88004 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. పునరుద్ధరణ బృందాలు 24 గంటల షిఫ్ట్ విధానంలో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
News August 14, 2025
KNR: అందరూ భాగస్వాములు కావాలి: సీపీ

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవం సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా KNR సీపీ గౌష్ ఆలం అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.
News August 14, 2025
KNR: భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.