News August 13, 2025
జగిత్యాల: ‘అర్హులైన మహిళలను సంఘాల్లో చేర్చాలి’

అర్హులైన మహిళలను తప్పనిసరిగా సంఘాల్లో చేర్చాలని DRDO రఘువరణ్ తెలిపారు. JGTL కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణా తరగతిలో మాట్లాడారు. సెర్ప్ ఆదేశాల మేరకు వృద్ధ మహిళలు, దివ్యాంగులు, స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే గృహిణులను వర్గాలవారీగా సంఘాలలో చేర్చాలని సూచించారు. గ్రామ స్థాయి సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అర్హులను గుర్తించాలన్నారు. 15-30 తేదీల్లో సంఘాల ఏర్పాటు, బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలన్నారు.
Similar News
News April 18, 2026
రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.
News April 18, 2026
లోక్సభ నిరవధిక వాయిదా

లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
News April 18, 2026
గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.


