News August 13, 2025
VKB: ‘పంచాయతీ అధికారులు రానున్నారు’

గ్రామాలకు పంచాయతీ అధికారులు వస్తున్నందున క్లస్టర్ వారిగా వివరాలను రూపొందించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారిగా క్లస్టర్లను రూపొందించాలని, గ్రామపంచాయతీ అధికారులు వస్తున్నందున వారి కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News August 14, 2025
పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆర్&ఆర్, భూ సేకరణపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఏలూరు జిల్లాలో 5 వేలు ఎకరాలు భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1400 ఎకరాలను గుర్తించామన్నారు. భూ సేకరణ పనులు ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
News August 14, 2025
గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్లో రాకపోకలు బంద్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
SHARE IT
News August 14, 2025
రూ.26 కోట్ల అంచనాతో 44 జలవనరుల పనులు: కలెక్టర్

జలవనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టోరేషన్ RRR క్రింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులకు కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు.