News August 13, 2025

HYD: ఇంజనీరింగ్ వైపు ఆసక్తి తగ్గుతుందా?

image

ఇంజినీరింగ్ విద్య వైపు ఆసక్తి తగ్గుతుందా? అంటే ప్రస్తుత గుణాంకాలతో అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 55.8% మాత్రమే సీట్ల భర్తీ అయ్యాయి. మిగిలినవి స్పాట్ కౌన్సెలింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే 15 శాతానికిపైగా సీట్లు గ్రేటర్ పరిధిలో మిగిలాయి. మరోవైపు B TECH ఇంజినీరింగ్ సీట్లు సైతం మిగలటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Similar News

News August 13, 2025

గుంటూరు ప్రజలకు కమిషనర్ సూచన

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. బుధవారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తాగునీటి సమస్యలు, చెట్లు విరిగి ట్రాఫిక్‌కి అడ్డుగా ఉన్నా, వర్షం నీరు నిలిచినా 08632345103, 104,105 నంబర్‌లకు సమాచారం అందించాలని చెప్పారు.

News August 13, 2025

MDK: రాఖీ పౌర్ణమి.. ఆర్టీసీకి భారీ ఆదాయం

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ.2.73 కోట్ల ఆదాయం వచ్చిందని రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. SRD డిపోకు రూ.41.79 లక్షలు, ZHBకు రూ.35.73 లక్షలు, ఖేడ్‌కు రూ.25.06 లక్షలు, MDKకు రూ.41.85 లక్షలు, నర్సాపూర్‌కు రూ.11.85 లక్షలు, సిద్దిపేటకు రూ.48.12 లక్షలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌కు రూ.42.75 లక్షలు, దుబ్బాకకు రూ.26.74 లక్షలు వచ్చినట్లు వివరించారు.

News August 13, 2025

లక్ష్మీ నరసింహం: గుంటూరు తొలి ఎంపీ

image

స్వాతంత్ర్య సమరయోధుడు శిష్ట్లా వెంకట లక్ష్మీ నరసింహం 1911 మే 24న ఉమ్మడి గుంటూరులో జన్మించారు. 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్.జి.రంగాను ఓడించి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా 1936 నుంచి 2004 వరకు పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో రెండు సార్లు జైలుకు వెళ్లారు. 2006 సెప్టెంబర్ 28న 96 ఏళ్ల వయసులో మరణించారు.