News August 13, 2025

పైరసీ పెరగడానికి నిర్మాతలు, ప్రభుత్వాలే కారణమా?

image

సినిమా పైరసీ పెరగడానికి నిర్మాతలు, GOVTలే పరోక్షంగా కారణమనే సమాధానాలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. కొత్త సినిమాలకు ప్రత్యేక రేట్లతో స్పెషల్ <<17383707>>GOలిస్తూ <<>>జేబులు గుల్ల చేస్తున్నాయి. ఒక టికెట్ ₹500-800 అయితే, పాప్‌కార్న్ ఖర్చు కలిపి ఇద్దరు వెళ్తే ₹2000 ఆవిరి కావాల్సిందే. OTTలో చూడాలంటే ఆ రేట్లు భరించలేక ప్రతీ సినిమాకు స్పెషల్ రేట్లు పెట్టలేక పైరసీ వైపు మొగ్గుచూపుతున్నట్లు అభిమానులు చెబుతున్నారు.

Similar News

News April 19, 2026

అల్లికలతో వ్యసనాలకు చెక్!

image

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

పాక్‌లో భారీ భద్రత.. రెండో విడత చర్చల కోసమేనా?

image

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా క్లారిటీ రాకపోయినా పాకిస్థాన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇస్లామాబాద్, రావల్పిండీ నగరాల్లో కఠిన ఆంక్షలు విధించింది. రావల్పిండీలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పార్కులు, బ్యాంకులు, షాప్స్, రెస్టారెంట్లను మూయించింది. 600 చెక్ పాయింట్లలో 10వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది.

News April 19, 2026

నగరడోన@45.4 డిగ్రీలు.. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.