News August 13, 2025
ఈనెల 25న వర్ధన్నపేటలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రెండవ విడత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 25న సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్రతో నియోజకవర్గంలోకి చేరుకుంటారని, 26న ఉదయం 7 నుంచి 10 గంటల వరకు శ్రమదానం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 10:30కు వరంగల్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు. కాగా, పాదయాత్ర రూట్ ఖరారు కావాల్సి ఉంది.
Similar News
News August 14, 2025
పులివెందుల ZPTC ఫలితాలు: ఎవరికి ఎన్ని ఓట్లు.!

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తి అయింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6 వేల పై చిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు. 11 మంది బరిలో ఉన్నారు.
లతా రెడ్డి: 6716, హేమంత్ రెడ్డి: 683
శివ కళ్యాణ్ రెడ్డి: 101, సురేశ్ రెడ్డి: 4
అనిల్ రెడ్డి: 1, శివా రెడ్డి: 0
రవీంద్రా రెడ్డి: 14, గాజేంద్రనాథ్ రెడ్డి: 79
మారెడ్డి భరత్ రెడ్డి: 35, వెంగల్ రెడ్డి: 3
సునీల్ యాదవ్: 2.
News August 14, 2025
ASF: పాపం.. పురిటినొప్పులతో 4KMల పయనం

పురిటినొప్పులతో సతమతమవుతున్న గర్భిణిపై దేవుడు కూడా కరుణ చూపలేదు. వర్షంలో గుంతలు, ఎత్తుపల్లాల దారిలో బైక్పై, నడిచి అవస్థల ప్రయాణం చేసిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ASF(D) వాంకిడి(M) గొందాపూర్కి చెందిన దేవ్బాయికి బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. 4KM వానలో తడుస్తూ బైక్పై, ఆ తర్వాత 108లో వాంకిడి ఆసుపత్రికి తరలించగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె పరిస్థితి విషమించడంతో HYD గాంధీ ఆసుపత్రికి తరలించారు.
News August 14, 2025
సిరిసిల్ల: ‘అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం’

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.