News August 13, 2025

ఈనెల 25న వర్ధన్నపేటలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

image

ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రెండవ విడత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 25న సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్రతో నియోజకవర్గంలోకి చేరుకుంటారని, 26న ఉదయం 7 నుంచి 10 గంటల వరకు శ్రమదానం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 10:30కు వరంగల్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు. కాగా, పాదయాత్ర రూట్ ఖరారు కావాల్సి ఉంది.

Similar News

News April 17, 2026

దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

image

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

ఈ కారణాలవల్లే రోడ్డు ప్రమాదాలు: భద్రాద్రి ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నివారణలో పోలీస్, మున్సిపల్, వైద్య, రవాణా శాఖల సమన్వయం కీలకమని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని దమ్మపేట సభలో తెలిపారు.

News April 17, 2026

సంజామల @44.8°C

image

నంద్యాల జిల్లా సంజామలలో శుక్రవారం రికార్డు స్థాయిలో 44.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా జాగ్రత్తలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.