News August 13, 2025
E20 పెట్రోల్పై ఆ ప్రచారాలు తప్పు: కేంద్రం

E20 పెట్రోల్పై వస్తున్న <<17378231>>పుకార్లను<<>> కేంద్రం కొట్టిపారేసింది. దీని వల్ల పొల్యూషన్ తగ్గడమే కాకుండా వాహనాల పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది. E10 పెట్రోల్తో పోలిస్తే 30% తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొంది. మైలేజీ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదంది. డ్రైవింగ్ విధానం, వాహనం మెయింటెనెన్స్, టైర్ ప్రెషర్, AC లోడ్ వంటి వాటిపై మైలేజీ ఆధారపడి ఉంటుందని కేంద్రం వివరించింది.
Similar News
News August 13, 2025
ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు

AP, TGలో కుండపోత వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు రేపు కూడా సెలవు ప్రకటించారు. ఇప్పటివరకు TGలోని జగిత్యాల, హనుమకొండ, WGL, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, MDK, మంచిర్యాల, VKB జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఆదేశాలను స్కూళ్ల యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని కలెక్టర్లు, DEOలు హెచ్చరించారు. అటు APలోని గుంటూరు, NTR, బాపట్ల, ప.గో జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ఉండనుంది.
News August 13, 2025
ఈ తీర్పు BJP, కాంగ్రెస్కు చెంపపెట్టు: KTR

TG: గవర్నర్ కోటా MLCల ఎన్నికపై <<17393463>>సుప్రీంకోర్టు తీర్పు<<>> BJP, కాంగ్రెస్కు చెంపపెట్టు అని KTR అన్నారు. ‘గతంలో BRS పంపిన MLC ప్రతిపాదనలకు BJP అడ్డుపడింది. ఈ ప్రక్రియ పెండింగ్లో ఉండగానే కాంగ్రెస్ మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు సాగనివ్వమని చాటిచెప్పిన న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News August 13, 2025
అలా అయితే భారత్పై ట్రంప్ సుంకాలు ఎత్తేస్తారా!

రష్యా చమురు కొంటున్నందుకే భారత్పై 25% అదనపు సుంకాలు వేశామన్న ట్రంప్ మున్ముందు సంకట స్థితిని ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్పై యుద్ధానికి మనం ఫండింగ్ చేస్తున్నామన్నదే ఆయన ఆరోపణ. మరికొన్ని రోజుల్లో అలస్కాలో పుతిన్తో ట్రంప్ భేటీ కానున్నారు. అక్కడ సీజ్ఫైర్ ఒప్పందం కుదిరితే యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు భారత్ చమురు కొంటే USకు అభ్యంతరం ఉండదా? సుంకాలు నిలిపేస్తుందా? మరో సాకు చెబుతుందా? అనేది వేచిచూడాలి.