News August 13, 2025

నేడు ED విచారణకు మంచు లక్ష్మి

image

TG: సినీ నటి మంచు లక్ష్మి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆమెను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

Similar News

News August 14, 2025

పెన్షన్లు తీసుకునే వారికి BIG ALERT

image

AP: అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులిచ్చి పెన్షన్లు రద్దు చేయనుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియ చేపడతారు. 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేస్తారు. అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.

News August 14, 2025

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN

image

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో TDP ఘనవిజయం సాధించడంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలి’ అని CM ఆదేశించారు.

News August 14, 2025

సెలవులు రద్దు చేస్తూ ప్రకటన

image

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు అందించాలన్నారు.