News August 13, 2025
SKLM: రాష్ట్రస్థాయి డిబేట్ పోటీల్లో సత్తాచాటిన గంగోత్రి

శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాలకు చెందిన విద్యార్థినిని గంగోత్రికి రాష్ట్ర స్థాయి డిబేట్ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. ఆర్టీఐ చట్టంపై ఇటీవల రాష్ట్రస్థాయి పోటీలు విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ బి.శామ్యూల్ చేతులు చేతులమీదుగా అవార్డు అందుకున్నారని స్థానిక ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు మంగళవారం తెలిపారు. కళాశాలలో విద్యార్థినిని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
SKLM: పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తాం

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. కోస్టల్ కారిడార్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తీరప్రాంత వెంబడి పరిశ్రమలు స్థాపిస్తే ఏపీఐఐసీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. MLA శంకర్ పాల్గొన్నారు.
News August 13, 2025
విజయనగరం పైడితల్లమ్మ పండగ తేదీలు ఇవే

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 7న(మంగళవారం) ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 22 వరకు మండల దీక్ష ప్రారంభం అవుతుందన్నారు. అక్టోబర్ 6న (సోమవారం) తొలేళ్ల ఉత్సవం, 14న తెప్పోత్సవం, 21న ఉయ్యాల కంబాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. >Share it
News August 13, 2025
ఢిల్లీలో జరిగే వేడుకలకు సారవకోట సీడీపీఓకు ఆహ్వానం

ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలకు సారవకోట ఐసీడీఎస్ సీడీపీఓ వంశీ ప్రియకు ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రెడ్ పోర్ట్లో నిర్వహించే ఉత్సవాలలో ఆమె బయల్దేరనున్నారు. తనని ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.