News August 13, 2025

మహిళను చేయి పట్టి లాగడం నేరమేమీ కాదు: హైకోర్టు

image

ఎలాంటి దురుద్దేశం లేకుండా ఓ పురుషుడు మహిళను చేయి పట్టి లాగడం నేరమేమీ కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అది బాధ పెట్టే చర్య మాత్రమేనని పేర్కొంది. 2015లో చోళవందానైకి చెందిన మురుగేశన్ ఓ దివ్యాంగురాలిని చేయి పట్టి లాగినట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అతడు హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News August 19, 2025

చైనాలో తైవాన్‌ భాగమేనని భారత్ చెప్పిందా?

image

చైనాలో తైవాన్ భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారని చైనా అధికారిక మీడియా Xinhua పేర్కొంది. నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ‌తో భేటీలో ఈ మేరకు జైశంకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు తైవాన్ విషయంలో భారత స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై భారత్ అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ రానుంది.

News August 19, 2025

పద్మజ మరణంపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

image

నందమూరి జయకృష్ణ భార్య పద్మజ <<17450773>>మృతిపై<<>> ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. పద్మజ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని తెలిపారు. కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన అత్త ఆకస్మిక మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లోకేశ్ పేర్కొన్నారు.

News August 19, 2025

తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తెల్లవారుజామున తీరం దాటినట్లు APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్రలోని కృష్ణా, ఏలూరు, అల్లూరి, వైజాగ్, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.