News August 13, 2025
ఖమ్మం: నీకు మరణం లేదు మిత్రమా..!

అమ్మ జన్మనిస్తే.. అవయవదానం పునర్జన్మనిస్తుంది. అవయవదానంపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా కొందరు అపోహలు, అనుమానాలతో వెనకడుగు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో మాత్రం అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. కూసుమంచి(M)చేగొమ్మకి చెందిన మహేశ్ ఈ ఏడాది జనవరి 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మరణించారు. కుటుంబ సభ్యులు మహేశ్ అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం.
Similar News
News April 17, 2026
హార్ముజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్

హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు చెందిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి $89.26కు చేరింది. మరోవైపు USకు చెందిన WTI క్రూడ్ $10.45 తగ్గి $84.24కు, UAEకి చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి $93.46కు చేరాయి. యుద్ధంతో ఓ దశలో $150కి చేరుతుందనుకున్న చమురు ధర ఇప్పుడు ఈ స్థాయిలో తగ్గడం ఊరటనిస్తోంది.
News April 17, 2026
VZM: ‘మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి’

రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహ బోర్డు ద్వారా జిల్లాకు మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులతో విజయనగరం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాకు 4 పరిశ్రమలు మంజూరయ్యాయని, వీటికి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వచ్చాయన్నారు. ఆటంకాలు లేకుండా పనులను ప్రారంభించాలన్నారు.
News April 17, 2026
ఆదిలాబాద: విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఐటీడీఏ పీవో

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరిగిందని పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీడీఏ ఆధ్వర్యంలో 16 పాఠశాలలను విద్య ప్లస్ పాఠశాలలుగా మార్చి ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుందన్నారు.


