News August 13, 2025

ఆచార్య ఎన్.జి.రంగా: భారత రైతాంగ ఉద్యమ పిత

image

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలులో నవంబరు 7, 1900న జన్మించారు. ఆయనను భారత రైతాంగ ఉద్యమ పితగా పరిగణిస్తారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. ఆరు సార్లు జైలుకు వెళ్లారు. 1930-1991 వరకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 1991లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. జూన్ 9, 1995న మరణించారు.

Similar News

News August 14, 2025

భద్రాద్రి: మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు

image

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ స్థాయిలో పనిచేసిన ఆరుగురు దళ కమిటీ సభ్యులు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలో భాగంగా వారు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.

News August 14, 2025

సింగూరు డ్యామ్‌కు డేంజ‌ర్ బెల్స్: KTR

image

సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించిన నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, నేడు సింగూరు డ్యామ్‌కు డేంజ‌ర్ బెల్స్ మోగాయ‌ని కేటీఆర్ ఆరోపించారు.

News August 14, 2025

పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

PDPL- మంథని ప్రధాన రహదారిలోని గంగాపురి స్టేజీ వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో వెంకటేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ముత్తారం రోడ్డు నుంచి మంథని- PDPL రహదారి మీదుగా రావడానికి గంగాపురి క్రాసింగ్ వద్దకు అతడు రాగా వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, ఈ ప్రమాదంలో మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. ఈ మలుపు వద్ద ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు.