News April 1, 2024

విజయవాడ: నేటినుంచి మొదలు కానున్న దరఖాస్తు ప్రక్రియ

image

విజయవాడ మధురా నగర్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 2024- 25 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో అడ్మిషన్లకై నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తును https://no1vijayawada.kvs.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ప్రిన్సిపాల్ ఆదిశేషవర్మ తెలిపారు. 1వ తరగతిలో అడ్మిషన్‌ కై మార్చి 2024 నాటికి 6 నుంచి 8 సంవత్సరాల వయసున్న పిల్లలు ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News October 6, 2024

కృష్ణా జిల్లాలోృ 99% మేర ఈ-క్రాప్ నమోదు పూర్తి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో 99% మేర ఈ-క్రాప్ నమోదు, 89% మేర ఈ కేవైసీ పూర్తయినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటలు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుని ఈ కేవైసీ చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి వీలవుతుందన్నారు.

News October 6, 2024

నేడు మచిలీపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

image

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు మచిలీపట్నం నోబుల్ కాలేజ్‌లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు హీరో హీరోయిన్ సుహాస్, సంగీర్తనతోపాటు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్, చిత్ర యూనిట్ మొత్తం తరలి రానుంది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు.

News October 6, 2024

ప్రజలపై టికెట్ రేట్ల భారం మోపము: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల

image

ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.