News August 13, 2025
MDK: రాఖీ పౌర్ణమి.. ఆర్టీసీకి భారీ ఆదాయం

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ.2.73 కోట్ల ఆదాయం వచ్చిందని రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. SRD డిపోకు రూ.41.79 లక్షలు, ZHBకు రూ.35.73 లక్షలు, ఖేడ్కు రూ.25.06 లక్షలు, MDKకు రూ.41.85 లక్షలు, నర్సాపూర్కు రూ.11.85 లక్షలు, సిద్దిపేటకు రూ.48.12 లక్షలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్కు రూ.42.75 లక్షలు, దుబ్బాకకు రూ.26.74 లక్షలు వచ్చినట్లు వివరించారు.
Similar News
News August 14, 2025
భద్రాద్రి: మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ స్థాయిలో పనిచేసిన ఆరుగురు దళ కమిటీ సభ్యులు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలో భాగంగా వారు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.
News August 14, 2025
సింగూరు డ్యామ్కు డేంజర్ బెల్స్: KTR

సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, నేడు సింగూరు డ్యామ్కు డేంజర్ బెల్స్ మోగాయని కేటీఆర్ ఆరోపించారు.
News August 14, 2025
పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

PDPL- మంథని ప్రధాన రహదారిలోని గంగాపురి స్టేజీ వద్ద బైక్ను లారీ ఢీకొనడంతో వెంకటేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ముత్తారం రోడ్డు నుంచి మంథని- PDPL రహదారి మీదుగా రావడానికి గంగాపురి క్రాసింగ్ వద్దకు అతడు రాగా వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, ఈ ప్రమాదంలో మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. ఈ మలుపు వద్ద ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు.