News August 13, 2025
MBNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిఘా

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. MBNR-10,904, NGKL-8,525, WNPT-6,538, GDWL-6,488, NRPT- 5,233 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36,224 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకున్నారు.
Similar News
News August 14, 2025
హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల్లో ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
News August 14, 2025
నిర్మల్: నష్టం జరగకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో స్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం పెరిగిన సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
News August 14, 2025
నిర్మల్: ‘కడెం ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’

భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లాలో చేపట్టిన సహాయక చర్యల గరించి వివరించారు. కడెం ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. అత్యవసర సహాయం కోసం 24 గంటల కంట్రోల్ రూమ్ను (9100577132) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.