News August 13, 2025

ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి : వరంగల్ సీపీ

image

రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కమిషనర్ తెలిపారు.

Similar News

News April 17, 2026

నేడు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

image

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టనున్నట్లు వరంగల్ జిల్లా ఛైర్మన్ గజ్జల రామ్ కిషన్ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు అనుమతి కోరుతూ అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఫణి కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

News April 16, 2026

గీసుగొండ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

image

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలం కోనాయిమాకులం రైతు వేదికలో మండల స్థాయి సమావేశం జరిగింది. కలెక్టర్ డా. సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ముఖ్య అంశాలపై అధికారులు, సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

News April 13, 2026

వరంగల్ ప్రజావాణిలో 166 వినతులు

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డా.సత్య శారద ప్రజల నుంచి 166 వినతిపత్రాలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 74, జీడబ్ల్యూఎంసీకి 25, ఇతర శాఖలకు 67 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత అధికారులతో సమక్షంలోనే చర్చించి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. జూమ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమన్వయం చేసి చర్యలు చేపట్టారు.