News April 1, 2024
జహీరాబాద్లో BRS గెలుపు ఖాయం: హరీశ్రావు

జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థాయి BRS కార్యకర్తల సమావేశం లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొని మాట్లాడుతూ.. జహీరాబాద్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News September 9, 2025
మెదక్: ‘ఫిర్యాదుల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలి’

మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం అమలులో ఉన్నట్లు జిల్లా అధికారి హేమ భార్గవి తెలిపారు. ఈ చట్టం ప్రభుత్వం, ప్రైవేట్ ప్రతి యజమాని లైంగిక వేధింపులు లేని కార్యాలయాన్ని అందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అంతర్గత ఫిర్యాదులు, కార్యాలయంలో లైంగిక వేదింపుల ఫిర్యాదులను పరిష్కారం కోసం ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 9, 2025
మెదక్: ఈనెల 13న జాతీయ మెగా లోక్ అదాలత్

ఈ నెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. “రాజీ మార్గమే రాజమార్గం. కక్షలతో ఎటువంటి లాభం ఉండదని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని” అన్నారు. రాజీ పడితే ఇరువురూ గెలుస్తారని, కొట్టుకుంటే ఒకరే గెలుస్తారని స్పష్టం చేశారు. ప్రజలు లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
News September 9, 2025
చిలిపిచేడ్: విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి

వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి చెందిన ఘటన చిలిపిచేడ్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. చిట్కూల్ గ్రామానికి చెంది భవానిపల్లి కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఒక వ్యవసాయ క్షేత్రంలో కూలికి వెళ్లి గడ్డి కోత మిషన్తో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు