News August 13, 2025

రాష్ట్రంలో కొత్త జిల్లాలపై BIG UPDATE

image

AP: జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై SEP 15 వరకు తమ నివేదికను CM చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం(జీవోఎం) నిర్ణయించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ ముగించాల్సి ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. వీటిపై SEP 2 వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు.

Similar News

News April 19, 2026

RRR నిర్మాణం.. ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr పరిహారం!

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ కొనసాగుతోంది. సంగారెడ్డి(D) సదాశివపేట(M) పెద్దాపూర్ పరిధిలోని భూములకు ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr, కనిష్ఠంగా దౌల్తాబాద్ శివారు భూములకు ఎకరానికి ₹16L ఇస్తున్నట్లు సమాచారం. RRR కోసం సంగారెడ్డి CALA పరిధిలో 526 ఎకరాలు అవసరమని NHAI నిర్ణయించింది. ఇప్పటివరకు నిర్వాసితులకు ₹119.50Cr చెల్లించారు.

News April 19, 2026

అప్పులపై రాజధాని.. అలాగే మావిగన్ సరికాదు: విజయసాయిరెడ్డి

image

AP: రాష్ట్రానికి క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరమని YCP మాజీ MP విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘రూ.లక్షల కోట్లతో అమరావతి ప్రణాళిక ఉంది. అప్పులపై రాజధాని నమూనా సరికాదు. ఏకీకృత, దశలవారీ అభివృద్ధితో నిర్మించాలి. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాజధాని అనేది పరిపాలనకు నాడీ‌కేంద్రంగా ఉండాలి. మావిగన్ అంటూ పరిపాలనా విభజన ప్రమాదం. దీంతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది’ అని అన్నారు.

News April 19, 2026

భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మలుపు ‘ఆర్యభట్ట’

image

భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975లో ఇదే రోజు రష్యాలోని కాపుస్తిన్ యార్ ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చేపట్టింది. X-RAY ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సోలార్ ఫిజిక్స్‌పై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ప్రయోగించింది. 5 రోజులపాటు విజయవంతంగా పనిచేసిన ఈ శాటిలైట్ దాదాపు 17yrs తర్వాత భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆనాడు వేసిన ఈ చిన్న అడుగే నేడు స్పేస్ రంగంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపింది.