News August 13, 2025
ప్రకాశం: తుఫాన్ ఎఫెక్ట్.. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం తహశీల్దార్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. తుఫాన్ కారణంగా ఏమైనా సమస్యలు ఎదురైతే, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 1077కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Similar News
News August 16, 2025
ఒంగోలులో సందడిగా ఎట్ హోమ్ కార్యక్రమం

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు.
News August 15, 2025
కష్టమైనా.. స్వాతంత్ర్య వేడుకలకు ప్రకాశం కలెక్టర్.!

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెకు పోలీసులు గౌరవ వందనం చేశారు. కలెక్టర్ కాలి పట్టీతో వేడుకలకు హాజరయ్యారు. కాలికి ప్రాక్చరై నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కలెక్టర్ వేడుకలకు వచ్చారంటూ అక్కడి అధికారులు చర్చించుకోవడం కనిపించింది. వేడుకలు ముగిసేవరకు కలెక్టర్ అక్కడే ఉన్నారు.
News August 15, 2025
ప్రకాశం జిల్లాలో బాలిక కిడ్నాప్

చీమకుర్తిలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి బాలికను శుక్రవారం కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. బాలిక తండ్రి తన నుంచి రూ.5 లక్షల అప్పు తీసుకుని ఇవ్వలేదని ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత కుమార్తెతో తండ్రికి ఫోన్ చేయించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈశ్వర్ రెడ్డి బాలికను తిరుపతి వైపు తీసుకెళ్తుండటంతో పోలీసులు అతడిని వెంబడిస్తున్నారు.