News August 13, 2025
HYD: JNTUలో రెండో సెమిస్టర్ ఫలితాల విడుదల

బీ ఫార్మసీకి సంబంధించి రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈరోజు HYD జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్కి సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. 5,573 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 5,433 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 4,215 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు. 77.52 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైందని వారు తెలిపారు.
Similar News
News September 3, 2025
నకిలీ కాల్స్పై ఉద్యోగులకు ఏసీబీ సూచనలు

నకిలీ కాల్స్తో ఉద్యోగులను మోసగాళ్లు భయపెడుతున్న నేపథ్యంలో ACB హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ 91548 93428 నంబర్ నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు సైఫాబాద్ PSలో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. అధికారులు ఎప్పుడూ డబ్బులు అడగరు, నకిలీ కాల్స్ నమ్మొద్దు, డబ్బులు చెల్లించొద్దంటు ఏసీబీ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో 1064 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలంది.
News September 3, 2025
HYD: లంచం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

HYDలో GST/కస్టమ్ డిపార్ట్మెంట్కు చెందిన సీనీయర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం కేసులో అరెస్టు చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి ₹30,000 లంచం డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ₹25,000కు ఒప్పుకున్నారు. సీబీఐ బృందం రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేసింది. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
News September 3, 2025
గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీపై HYD సీపీ సమీక్ష

సీపీ సీవీ ఆనంద్ గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల భద్రతా ఏర్పాట్లపై HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోనల్ ఆఫీసర్లు, లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో భద్రత ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహిస్తామని తెలిపారు.