News August 13, 2025
NZB: కలెక్టరేట్లో అధికారులతో ఎంపీ అర్వింద్ సమీక్ష

నిజామాబాద్ కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎంపీ అర్వింద్ ధర్మపురి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పలు ఆర్వోబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే, ఆర్అండ్బీ, నేషనల్ హైవే, ఇతర శాఖల కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు.
Similar News
News August 14, 2025
NZB: ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ఏదో ఒక మండలాన్ని, ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను గోప్యంగా ఉంచడంతో డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ ఏ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియక ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News August 14, 2025
NZB: ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ఏదో ఒక మండలాన్ని, ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను గోప్యంగా ఉంచడంతో డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ ఏ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియక ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News August 14, 2025
NZB: ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు రాష్ట్రానికి ముప్పు: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన NZBలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందని మండిపడ్డారు.