News August 13, 2025

అల్లూరి: యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

image

యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం పాడేరులో కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మేరకు, ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రెండు వారాల పాటు జరుపుకోవాలని తెలియజేశారు.

Similar News

News August 14, 2025

శ్రీకాకుళం: ఒకే కాన్పులో రెండు దూడలు

image

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలోని రామాలయం వీధిలో రైతు కృష్ణారావుకు చెందిన ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. గురువారం జరిగిన ఈ అరుదైన సంఘటనతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రెండు దూడల్లో ఒకటి ఆడది, మరొకటి మగది అని రైతు తెలిపారు. తల్లి గోవు, 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. గోవును దైవంగా భావించే తనకు ఈ విషయం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

News August 14, 2025

TU: ఇంజినీరింగ్ కళాశాలలో 61 మంది విద్యార్థుల రిపోర్ట్

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలకు 81 మంది విద్యార్థులను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎప్‌సెట్ ద్వారా కేటాయించారు. సీఎస్‌ఈలో 65 మందికి గాను 61, CSE(AI)లో 9 మందికి ఏడుగురు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముగ్గురు, డాటా సైన్స్‌లో ముగ్గురు విద్యార్థులు రిపోర్ట్ చేసి అడ్మిషన్లు తీసుకున్నారని ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి తెలిపారు. విద్యార్థులకు వసతి సౌకర్యం లేదని స్పష్టం చేశారు.

News August 14, 2025

స్టార్ ప్లేయర్ తండ్రి కన్నుమూత

image

ప్రముఖ టెన్నీస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వెసీ పేస్(80) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతాలోని ఆస్పత్రిలోని చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. వెసీ పేస్ 1972లో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు.