News August 13, 2025

కడెం: 3 గేట్ల ద్వారా నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరగడంతో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టులోకి 40,066 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎడమ కాలువకు 384, కుడి కాలువకు 20, మిషన్ భగీరథకు 9, దిగువకు 17,601 క్యూసెక్కులు వదులుతున్నారు.

Similar News

News August 14, 2025

పులివెందుల ZPTC ఫలితాలు: ఎవరికి ఎన్ని ఓట్లు.!

image

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తి అయింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6 వేల పై చిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు. 11 మంది బరిలో ఉన్నారు.
లతా రెడ్డి: 6716, హేమంత్ రెడ్డి: 683
శివ కళ్యాణ్ రెడ్డి: 101, సురేశ్ రెడ్డి: 4
అనిల్ రెడ్డి: 1, శివా రెడ్డి: 0
రవీంద్రా రెడ్డి: 14, గాజేంద్రనాథ్ రెడ్డి: 79
మారెడ్డి భరత్ రెడ్డి: 35, వెంగల్ రెడ్డి: 3
సునీల్ యాదవ్: 2.

News August 14, 2025

ASF: పాపం.. పురిటినొప్పులతో 4KMల పయనం

image

పురిటినొప్పులతో సతమతమవుతున్న గర్భిణిపై దేవుడు కూడా కరుణ చూపలేదు. వర్షంలో గుంతలు, ఎత్తుపల్లాల దారిలో బైక్‌పై, నడిచి అవస్థల ప్రయాణం చేసిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ASF(D) వాంకిడి(M) గొందాపూర్‌కి చెందిన దేవ్‌బాయికి బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. 4KM వానలో తడుస్తూ బైక్‌పై, ఆ తర్వాత 108లో వాంకిడి ఆసుపత్రికి తరలించగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె పరిస్థితి విషమించడంతో HYD గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News August 14, 2025

సిరిసిల్ల: ‘అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం’

image

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.