News August 13, 2025
KMR: జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. బుధవారం కామారెడ్డి అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు, కుంటలు నిండినప్పుడు వాటిని చూడటానికి ప్రజలు, ముఖ్యంగా పిల్లలు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైతే 100కు డయల్ చేయాలన్నారు.
Similar News
News April 18, 2026
విశాఖ-మహబూబ్నగర్ రైళ్ల పాక్షిక రద్దు

సికింద్రాబాద్-డోన్ సెక్షన్ పరిధిలోని మహబూబ్నగర్ – మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ – మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు విశాఖలో బయలుదేరే రైలు (12861) జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే 19 నుంచి 21 వరకు మహబూబ్నగర్ రైలు (12862) జడ్చర్ల నుంచే తిరుగు ప్రయాణం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలనీ సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు.
News April 18, 2026
పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
News April 18, 2026
రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.


