News August 13, 2025

24 గంటల్లో బాలికల ఆచూకీ లభ్యం

image

చదువుకోమని తలిదండ్రులు మందలించడంతో ఇద్దరు బాలికలు ఇల్లు వదిలి వెళ్లిన ఘటన వేటపాలెంలో చోటుచేసుకుంది. స్కూల్‌కి వెళ్తున్నా అని చెప్పిన బయటకు వెళ్లి బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన SI జనార్ధన్ జిల్లా ఉన్నత అధికారుల సూచనలతో 5 విభాగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను 24 గంటల్లోనే గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News August 14, 2025

పెన్షన్లు తీసుకునే వారికి BIG ALERT

image

AP: అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులిచ్చి పెన్షన్లు రద్దు చేయనుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియ చేపడతారు. 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేస్తారు. అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.

News August 14, 2025

మంచిర్యాల జిల్లాలో మంత్రి వర్సెస్ MLA

image

జిల్లాలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకుంది. ఈనెల 19న పోలింగ్ జరుగనుండగా బరిలో ఉన్న అభ్యర్థులు కార్మిక వాడల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. మంత్రి వివేక్ వర్గం నుంచి విక్రమ్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే మద్దతుతో సత్యపాల్‌రావు, ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న కోల్డ్ వార్‌తో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇరువర్గాల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది.

News August 14, 2025

నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షం ఇక్కడే..!

image

నంద్యాల జిల్లాలోని 30 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 40.6 మి.మీ వర్షపాతం నమోదైంది. బండిఆత్మకూరు 34 మి.మీ, శ్రీశైలం 29.2 మి.మీ, ఆత్మకూరు 23.6 మి.మీ, పగిడ్యాల 22.8 మి.మీ, గడివేముల 18.2 మి.మీ, నంద్యాల అర్బన్ 15.6 మిమీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యల్పంగా చాగలమర్రి మండలంలో 2.2 మి.మీ వర్షం పడింది.