News April 1, 2024
ప్రకాశం: మసిలే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం

నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన భార్యభర్తలు గత కొద్దిరోజులుగా హనుమాన్ నగర్ 13వ లైన్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడి నీరు పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు వాపోయాడు. కేసు నమోదైంది.
Similar News
News March 25, 2026
చీమకుర్తి: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

చీమకుర్తి మండలంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గోనేపల్లివారిపాలేనికి చెందిన అంజలి(21) గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను పెళ్లికి ఒప్పుకోలేదు. ఈక్రమంలో అతని పొలం వద్దే ఆమె ఉరేసుకుని చనిపోయింది. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 25, 2026
ప్రకాశం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం SNపాడు, వై.పాలెం, కొండపి SC నియోజకవర్గాలు. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 25, 2026
ప్రకాశం: ఇద్దరికి జైలుశిక్ష

ప్రకాశం జిల్లా టంగుటూరులో శ్రీనివాస థియేటర్ దగ్గర ఓ బైక్, వల్లూరు ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీలో పార్కింగ్ చేసిన మరో బైక్ దొంగతనానికి గురైంది. 2025లో కేసు నమోద చేశారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన బండారు నవీన్, తాళ్లూరి గాబ్రియల్గా గుర్తించారు. నేరం రుజువు కావడంతో వారికి రూ.10వేల జరిమానా, 5నెలలు జైలుశిక్ష పడింది.


