News August 13, 2025
గుంటూరు చరిత్రలో మర్చిపోలేని PHOTO ఇది

బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే గుంటూరులో 1947 ఆగస్టు 15వ తేదీన ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించారు. స్థానిక AC కళాశాలలో అదే రోజు జెండా ఎగురవేశారు. AC కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ నారాయణ తన మాటలతో ప్రజలను ఉత్సహ పరిచరారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు. ప్రముఖ వ్యక్తులు ప్రసంగించారు. పైన ఉన్నది అప్పటి ఫొటోనే.
Similar News
News August 15, 2025
GNT: ఎమ్మెల్యే కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం..!

గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ కార్యాలయం వద్ద శుక్రవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటీవల MLA ఓ మహిళతో మాట్లాడినట్లు వీడియో కాల్ను తానే క్రియేట్ చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను అనవసరంగా ఇరికించారంటూ మహిళ వాపోయింది
News August 15, 2025
గుంటూరు జిల్లాలో ఫ్రీ బస్సు.. 302 బస్సులు కేటాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా నేడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. అయితే గుంటూరు జిల్లా పరిధిలోని 5 డిపోల్లో 302 బస్సులను స్త్రీ శక్తి పథకానికి కేటాయించినట్లు ఇన్ఛార్జ్ RM సామ్రాజ్యం చెప్పారు. ఫ్రీ బస్సు పథకానికి 302 బస్సుల్లో కేటాయించగా వాటిలో 241 పల్లె వెలుగు, 8 అల్ట్రా పల్లె వెలుగు, 53 ఎక్స్ప్రెస్ బస్సులను మహిళలకు అందుబాటులో ఉంచామని ఆమె వెల్లడించారు.
News August 15, 2025
తెనాలి: స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఆదరణ కరవు

తెనాలికి చెందిన అడిగోపుల నరసింహారావు, బాలత్రిపుర సుందరి దంపతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. స్వాతంత్ర్య సంగ్రామం అనంతరం వీరి త్యాగాలను గుర్తిస్తూ ప్రభుత్వం తామ్ర పత్రాలను ఇచ్చి గౌరవించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆదరణలేక సాయం అందక వీరి కుమారుడు ఉమామహేశ్వరరావు దారం తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తూ అద్దె ఇంట్లో భారంగా కాలం వెలదీస్తున్నారు.