News August 13, 2025

గుంటూరు జిల్లాలోని స్కూళ్లకు రేపు సెలవు

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్కూళ్లకు గురువారం సెలవు ఇవ్వాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతో పాటు అంగన్వాడీలకు సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. వాగులు, వంకలకు వద్దకు ప్రజలు వెళ్లరాదని సూచించారు.

Similar News

News April 16, 2026

ఖమ్మం: జావేద్ మృతికి రాహుల్ గాంధీ సంతాపం

image

ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ అకాల మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నిబద్ధత గల నాయకుడు అని, ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించుకుంటుందని అన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. జావేద్ మృతి పట్ల ఇప్పటికే అటు రాష్ట్ర మంత్రులు, ఇటు స్థానిక నేతలు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

News April 16, 2026

NZB: ఆ రోజు BIG DAY.. రేవంత్ రెడ్డి Vs కేసీఆర్..!

image

APR 20న జరిగే భారీ బహిరంగ సభలు TGలో పొలిటికల్ హీట్‌ను పెంచనున్నాయి. BRS జగిత్యాల జైత్రయాత్ర సభలో KCR ప్రసంగించనున్నారు. అదే రోజు CM రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, సభలో మాట్లాడనున్నారు. అవుట్‌డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం BRS సభ పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటుండగా.. ఇన్ని రోజులు పట్టించుకోని రేవంత్ రెడ్డి KCRకు భయపడి ఇప్పుడు మేడిగడ్డను చూసేందుకు వస్తున్నారని BRS నేతలు అంటున్నారు.

News April 16, 2026

ఖమ్మంలో 18న జాబ్ మేళా.. డిగ్రీ అర్హతతో 20 ఉద్యోగాలు

image

ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈనెల 18న టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 20 ఖాళీల భర్తీకి డిగ్రీ అర్హత గల 20-40 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతో శనివారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.