News August 13, 2025
6నెలల్లో 221 మంది మృతి: చిత్తూరు కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ప్రమాదాల నివారణపై కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి జులై వరకు 451 ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ ఘటనల్లో 221 మంది మృతిచెందారన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News August 16, 2025
చిత్తూరు జిల్లా టీచర్ల గమనిక

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2025కు అర్హులైన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో కోరారు. 10 ఏళ్ల సర్వీసు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతిపాదనలు రెండు కాపీలను ఉపవిద్యా శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన ప్రతిపాదనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
News August 16, 2025
కాణిపాకంలో ఫ్రీ బస్ ప్రారంభం

కాణిపాకంలో ఫ్రీ బస్ పథకాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. మహిళల జీవన విధానంలో ఉచిత బస్సు ప్రయాణం విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సూపర్-6 పథకాల సాకారానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.
News August 15, 2025
చిత్తూరు: వైసీపీ నాయకుల పాదయాత్ర

మద్యం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆరోపించారు. ఆయన అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు. దొడ్డిపల్లి సప్త కన్యకమ్మల ఆలయం నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మారిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.