News August 13, 2025

కాచిగూడ: ఐక్యతను పెంచేందుకే ‘హర్ ఘర్ తిరంగా’

image

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్‌పురలో విద్యార్థులతో కలిసి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని నిర్వహించారు. గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ జె.అచ్యుతాదేవి, నంద గోపాల్ పాల్గొన్నారు.

Similar News

News August 14, 2025

పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్

image

పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయ్యింది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని న్యాయవాది పల్లె వినోద్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హైకోర్టులో పెద్దమ్మ గుడి కూల్చివేతపై విచారణ జరగనుంది. గుడి కూల్చివేత కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.

News August 14, 2025

గాంధీ భవన్‌లో ‘రాజీవ్ జ్యోతి’కి ఘన స్వాగతం

image

ఏటా పెరంబదూర్ నుంచి ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి నాటికి ఢిల్లీకి చేరుకునేలా చేపట్టే రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు HYDకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచన మేరకు యాత్రకు గాంధీ భవన్‌లో స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్, నాంపల్లి ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ ఉన్నారు.

News August 14, 2025

HYD: ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..?

image

సికింద్రాబాద్ కార్ఖానా ట్రాఫిక్ PS పక్కనే మెయిన్‌ రోడ్డుపై భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత ఏర్పడి ఏడాది దాటిందని, ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయలేదని, ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి గుంతను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చిన బైక్ నడిపే వ్యక్తి కారును ఢీకొట్టి గాయపడ్డాడు. మీ ప్రాంతంలో ఇలాంటి గుంతలు ఉంటే కామెంట్ చేయండి.