News April 1, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి పది మూల్యాంకనం

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు-2024 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైందని డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో స్పాట్‌ పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైందన్నారు. తాగునీరు, ఫర్నీచర్‌, లైటింగ్‌, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచమన్నారు.

Similar News

News July 8, 2024

శ్రీకాకుళం: మత్స్య అవతారంలో జగన్నాథుడు

image

శ్రీకాకుళం నగరంలోని మెండేటివీధి షిర్డీసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం జగన్నాథుడు, సుభద్ర బలభద్రుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్నాథ స్వామి వారిని మత్స్య అవతారంలో అలకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

News July 8, 2024

REWIND: వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా పర్యటనలు

image

మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో టెక్కలి, పలాస మీదుగా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు. 2006లో నందిగం మండలం దేవలభద్ర గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 2008 జనవరి 2వ తేదీన శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, 2008 ఏప్రిల్ 4న పలాస మండలం రేగులపాడులో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూన్ 14 ఆమదాలవలస మండలం కృష్ణాపురం వద్ద వంశధార కెనాల్ ప్రారంభించారు.

News July 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి దశావతారాల్లో జగన్నాథుడు

image

జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం, నరసన్నపేట ప్రాంతాల్లో జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు సుమారు 11 రోజుల పాటు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 8న మత్స్యవతారం, 9న కూర్మావతారం, 10న వరాహవతారం, 11,12న నృసింహావతారం, 13న వామనావతారం, 14న పరశురామవతారం, 15న శ్రీరామ అవతారం, 16న బలరామ-శ్రీకృష్ణావతారం, 17న తొలి ఏకాదశి రోజున శేష పాన్పు అవతారంలో దర్శనమిస్తారు.