News August 14, 2025
‘సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని సహించం’

సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని AITUC అధ్యక్ష, కార్యదర్శులు V.సీతారామయ్య, K.రాజ్కుమార్ అన్నారు. బుధవారం గోదావరిఖనిలో AITUC సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా విమర్శలు చేయడం INTUC విధానమా అని ప్రశ్నించారు.
Similar News
News August 16, 2025
ఖమ్మం జిల్లాలో 579.9 MM వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం 579.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. కొనిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదని సింగరేణి 61.4 మి.మీ, వైరా 55.4 మి.మీ, కుసుమాంచి 47.8 మి.మీ, కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 16, 2025
ధర్మవరంలో ఉగ్ర కలకలం

AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలో ఉగ్ర కలకలం రేగింది. కోట ఏరియాలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో IB, NIA, స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాకిస్థాన్కు అతను ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టీస్టాల్లో పనిచేస్తున్న నూర్ ఇంట్లో అనుమానిత వస్తువులు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో సంబంధాలపై NIA ఆరా తీస్తోంది.
News August 16, 2025
రూ.100 కోట్లు దాటిన ‘వార్-2’ కలెక్షన్లు

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’ మూవీ రెండో రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ‘Sacnilk’ ప్రకారం తొలిరోజు కంటే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. నిన్న మూవీకి రూ.56.35 కోట్లు రాగా తొలిరోజు రూ.52 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఈ మూవీ రూ.108.35 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు కూడా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.