News August 14, 2025

RBI కీలక నిర్ణయం.. గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్‌

image

బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్‌‌పై RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియకు 2 రోజుల సమయం పడుతుండగా తాజా నిర్ణయంతో కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ రానుంది. ఈ విధానం అక్టోబర్ 4 నుంచి తొలి దశలో, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో దశలో అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ట్రంకేషన్ సిస్టమ్‌లో RBI మార్పులు చేయనుంది. దీంతో బ్యాంకు పని వేళల్లోనే చెక్కును స్కాన్ చేసి కొన్ని గంటల్లోనే పాస్ చేయనున్నాయి.

Similar News

News August 16, 2025

కేసీఆర్ వద్దకు కవిత.. నిన్న ఏం జరిగిందంటే?

image

TG: తన చిన్న కుమారుడు ఆర్య చదువు కోసం US వెళ్తున్న తరుణంలో కవిత నిన్న KCRను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే కేసీఆర్-కవిత మాట్లాడుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఇంటి ప్రధాన ద్వారం వద్దే ఆమె ఉండిపోగా.. KCR ఆర్యను తన గదికి పిలిపించుకొని 10నిమిషాల పాటు మాట్లాడి, ఆశీర్వదించి పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫాంహౌస్‌కు చేరుకున్న KTR, హరీశ్ రావు, ఇతర నేతలూ కవితతో మాట్లాడలేదని సమాచారం.

News August 16, 2025

దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య

image

హైదరాబాద్ ఉప్పల్ రామంతాపూర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడి(5)పై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశాడు. రామంతాపూర్‌కు చెందిన బాలుడు ఈ నెల 12న కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానితుడ్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బాలుడికి మాయమాటలు చెప్పి ముళ్ల పొదల్లో అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు.

News August 16, 2025

FLASH: క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.60 తగ్గి రూ.1,01,180కు చేరింది. 8 రోజుల్లో మొత్తం ₹2,130 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,750 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,26,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.