News August 14, 2025
మెట్ పల్లి: పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: మధుయాష్కి గౌడ్

BRS పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. మెట్ పల్లిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తాను నిజామాబాద్ ఎంపీగా, కోరుట్ల ఎమ్మెల్యేగా రత్నాకర్ రావు ఉన్న హయంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్లీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, కృష్ణారావు తదితరులున్నారు.
Similar News
News August 14, 2025
బిహార్ ఓటరు లిస్టుపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

బిహార్లో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను జిల్లాల వారీగా ప్రకటించాలని ECని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటర్ల తొలగింపునకు గల కారణాలను వెల్లడించాలని సూచించింది. జిల్లాలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఈ వివరాలను ఉంచాలని, దీనిపై వార్తా పత్రికలు, రేడియో, SMలో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. AUG 19లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను AUG 22కి వాయిదా వేసింది.
News August 14, 2025
HYD: అలాంటి లక్షణాలు కనిపిస్తే.. హాస్పిటల్ వెళ్లండి.!

మత్తుకు బానిసవుతున్న యువత ఆరోగ్యం క్షేనిస్తోంది. జ్ఞాపకశక్తి మందగించడం, కళ్లు ఎరుపెక్కటం, పెదాలు పొడి బారిపోవడం, ఒంటరిగా బతకటం, మానసిక ఒత్తిడిని గమనించటం, ఆకలి తగ్గిపోవడం, అంతకు ముందులా నిద్ర లేకపోవడం, నిద్రకు దూరం అవటం లాంటివి గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని HYD ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
News August 14, 2025
వరంగల్: డీసీసీబీ పాలకవర్గం గడువు మరో ఆరు నెలలు పొడిగింపు

జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) పాలకవర్గం గడవు మరో ఆరు నెలలు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం పాలక వర్గాల గడువును పెంచడం సర్వత్రా జిల్లాలో చర్చ జరుగుతోంది. టెస్కాబ్ ఛైర్మన్గా ఉన్న మార్నేని రవీందర్ రావు మరో ఆరు నెలలు ఈ పదవిలో కొనసాగనున్నారు.శుక్రవారం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు నిర్వహించనున్నారు.