News August 14, 2025
ఆదికర్మయోగి-గిరిజనప్రాంత మార్పుకు గొప్ప శ్రీకారం: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆది కర్మయోగి కార్యక్రమం గిరిజన ప్రాంతంలో మార్పు తెచ్చుటకు గొప్ప శ్రీకారమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఐటిడిఏ కార్యాలయంలో బుధవారం బ్లాక్ స్ధాయి శిక్షణ, సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గిరిజనగ్రామాల్లో స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పీఎం జన్ మాన్ పీవో రిషబ్ చతుర్వేది, అసుతోష్ శ్రీవాస్తవ సభను ఉద్దేశించి మాట్లాడారు.
Similar News
News April 18, 2026
499/500.. 1 మార్క్ కోసం రీవాల్యుయేషన్కు వెళ్లిన అమ్మాయి!

CBSE టెన్త్ ఫలితాల్లో 90% వస్తేనే చాలామంది పండగ చేసుకుంటారు. కానీ ఆషిమాకు(కేరళం) 499 వచ్చినా సంతృప్తి చెందలేదు. తనకు అన్యాయం జరిగిందంటూ రీవాల్యుయేషన్కు రెడీ అయిపోయింది. అన్నింట్లో 100కు 100రాగా.. సైన్స్లో మాత్రం 99 వచ్చాయి. ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకొని 500/500 సాధిస్తానని ఆషిమా ధీమా వ్యక్తం చేస్తోంది. ‘టాపర్ కష్టాలు’ అంటే ఇవేనేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
News April 18, 2026
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆడుదాం.. ఆంధ్రా అక్రమాలు?

గత YCP హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అక్రమాలు ఎక్కువగా జరిగాయని ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ విచారణలో తేలింది. క్రీడాకారులకు ఇచ్చిన కిట్లు సైతం నాసిరకంగా ఉండటం, చేయని ఖర్చు చేసినట్లుగా చూపించి డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. బహుమతులు సొమ్ము కొట్టేయడం, పల్నాడు (D) అధికారి సంబంధించిన బిల్లులను సమర్పించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి.
News April 18, 2026
ఒకేషనల్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు


