News August 14, 2025

మారేడుమిల్లికి పర్యాటకులు రావొద్దు: సబ్ కలెక్టర్

image

రంపచోడవరం డివిజన్‌లో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నందున పర్యాటకులు రావద్దని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటవద్దని సూచించారు. ఎటువంటి సహాయానికైనా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నం. 08864243561 సంప్రదించాలన్నారు.

Similar News

News April 17, 2026

కర్నూలులో నేడే ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.

News April 17, 2026

పడిపోయిన బొప్పాయి ధరలు

image

AP: యుద్ధం వల్ల అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు పడిపోయాయి. 2 వారాల కిందట టన్నుకు రూ.13 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. ఇప్పటికే అకాల వర్షాలు, వైరస్, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 30-40 టన్నులు రావాల్సి ఉండగా 10-15 టన్నుల పంటే చేతికి వచ్చింది. అటు దిగుబడి, ఇటు రేటు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోటల్లోనే కాయలు పండిపోతున్నాయి.

News April 17, 2026

ఎల్కతుర్తి ఎస్‌ఐ ఏఆర్‌కు అటాచ్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా ఆయన్ను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యతో పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇద్దరి ఎస్సైలపై వేటు వేసిన విషయం తెలిసిందే.