News August 14, 2025

పాడేరు: ‘సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం’

image

గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం పాడేరు కాఫీ హౌస్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల ప్రదర్శనను ప్రారంభించారు. సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శనలో 10 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. గిరిజన ఉత్పత్తులకు అరకు బ్రాండ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

Similar News

News April 18, 2026

గాడిదలా నటించమని అడిగినా సరే..: ఆర్య

image

దర్శకులు బాల, పా.రంజిత్‌ను తాను ఎంతో నమ్ముతానని తమిళ హీరో ఆర్య చెప్పారు. వాళ్లతో సినిమాలకు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. ‘నాకు కథ చెప్పకుండానే వెట్టువమ్ మూవీని రంజిత్ తీస్తున్నారు. బాల సర్ నన్ను గాడిదగా చేయమన్నా సరే చేసేస్తా. నెల రోజుల్లో అఘోరీ లుక్(నేనే దేవుడ్ని) కోసం సిద్ధమవ్వాలని చెప్పి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు’ అని ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పారు.

News April 18, 2026

డీ‘లిటిగేషన్’.. గెలిచిందెవరు?

image

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో <<19674859>>వీగిపోవడం<<>> తమ విజయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా బిల్లు గట్టెక్కలేదని, ఇది ప్రజాస్వామ్య గెలుపు అని చెబుతున్నాయి. BJP మాత్రం మహిళా కోటాకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ ప్రభావం బెంగాల్, TN ఎన్నికల్లో ఉంటుందని భావిస్తోంది. అందుకే సంఖ్యా బలం లేకున్నా బిల్లు పెట్టిందనే చర్చ సాగుతోంది. దీనిపై మీ కామెంట్.

News April 18, 2026

బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

image

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.