News August 14, 2025

పంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలు బంద్

image

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మాంసం విక్రయాలు నిషేధిస్తున్నామని కర్నూలు నగర పాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. నగరంలోని కబేళాలు, మాంసం దుకాణాలు, నాన్ వెజ్ హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News August 15, 2025

కర్నూలులో ట్రాఫిక్ సమస్య ఉండొద్దు: మంత్రి

image

కర్నూలులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో వన్ సైడ్ పార్కింగ్, ఆటోల కోసం ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆర్టీసీ బస్సులు నగరంలోకి ప్రవేశించకుండా బయటి మార్గాల ద్వారా వెళ్లేలా చూడాలని పేర్కొన్నారు.

News August 14, 2025

కర్నూలు ఐపీఎస్ అధికారికి రాష్ట్రపతి మెడల్

image

కర్నూలుకు చెందిన 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డా.జీవీ సందీప్‌ చక్రవర్తి 6వ రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీకి ఎంపికయ్యారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీనగర్‌ ఎస్ఎస్పీగా సెంట్రల్‌ క్యాడర్‌లో పనిచేస్తున్నారు.

News August 14, 2025

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఏఎస్పీ

image

కర్నూలులో శుక్రవారం నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు. గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన రిహార్సల్‌ను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.