News August 14, 2025
దామరచర్లలో అత్యధికం.. నార్కట్ పల్లిలో అత్యల్పం

జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు జిల్లాలో 30 మి.మీ. సగటు వర్షం కురిసింది. దామరచర్లలో అత్యధికంగా 77.2 మి.మీ., అత్యల్పంగా నార్కెట్ పల్లిలో 2.5 మి.మీ. వర్షం కురిసింది. కనగల్ మండలంలో 42.7మి.మీ., మునుగోడు 15.5 మి.మీ., చండూరు 21.5 మి.మీ., మర్రిగూడ 48.2 మి.మీ., చింతపల్లి 13.1 మి.మీ., నాంపల్లి 32.6 మి.మీ., గుర్రంపోడు 42.5 మి.మీ., అనుములు హాలియా 23.7 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.
Similar News
News August 14, 2025
30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
News August 14, 2025
సీఎంకు రేవంత్కు గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ

‘మన ఊరు-మన బడి’ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ.361.350 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు.
News August 14, 2025
నల్గొండ: క్రీడా పాఠశాలకు 14 మంది విద్యార్థులు ఎంపిక

2025-26 సంవత్సరానికి హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి జిల్లా నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో నల్లగొండ జిల్లా విద్యార్థిని కలిమెల భావన ప్రథమ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు.