News August 14, 2025

పాక్‌ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి!

image

పాక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీ సిటీలో పలుచోట్ల వేడుకల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గన్స్ ఫైర్ చేయడంతో ముగ్గురు మరణించారని, 60 మందికి పైగా గాయాలపాలైనట్లు Geo News వెల్లడించింది. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉందని పేర్కొంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపింది. కాగా గత JANలోనూ ఈ తరహా కాల్పుల్లో 42 మంది చనిపోయినట్లు సమాచారం.

Similar News

News August 14, 2025

సెలవులు రద్దు చేస్తూ ప్రకటన

image

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు అందించాలన్నారు.

News August 14, 2025

రజినీకాంత్ ‘కూలీ’ రివ్యూ&రేటింగ్

image

మిత్రుడి(సత్యరాజ్)ని ఎవరు, ఎందుకు చంపారో హీరో(రజినీకాంత్) తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ‘కూలీ’ స్టోరీ. ఎప్పటిలాగే రజినీ ఎలివేషన్స్ అభిమానులకు నచ్చుతాయి. యాక్షన్ సీన్లు, కొన్నిచోట్ల ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథ పెద్దది కావడంతో సెకండాఫ్‌ సాగదీతలా అనిపిస్తుంది. నాగార్జున పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అక్కడక్కడ డౌన్ కావడం మైనస్‌.
రేటింగ్-2.5/5

News August 14, 2025

ఈసారి జగన్‌నూ ఓడిస్తాం: మంత్రి సవిత

image

AP: పులివెందుల ZPTC స్థానంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ‘పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఈ విజయానికి కష్టపడిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో జగన్‌నూ ఓడించి పులివెందుల కోటను బద్దలు కొడతాం’ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.