News August 14, 2025

మేదరమెట్ల: బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

కొరిశపాడు మండలం మేదరమెట్లలో సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాల వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు వెంపరాలకు చెందిన షేక్ జిలాని బాషాగా గుర్తించారు.

Similar News

News April 17, 2026

HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

image

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్‌కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2026

HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

image

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్‌కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2026

TU: పార్లమెంట్‌‌లో ప్రసంగించిన ‘కీర్తన’ను అభినందించిన ఉపకులపతి

image

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం నుంచి ఎంపికైన TU విద్యార్థిని కీర్తన ఈనెల 14న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించారు. VC యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి ఆమెను అభినందించారు. యూనివర్సిటీ తరఫున రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. VC మాట్లాడుతూ.. కీర్తన ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఆకాంక్షించారు.