News August 14, 2025

యాక్సిడెంట్‌లో మంచిర్యాల వాసులు దుర్మరణం

image

JGTL(D) వెల్గటూర్(M)లో బుధవారం రాత్రి RTC బస్సు గేదెను ఢీకొని అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. MNCL(D) లక్షెట్టిపేట(M) ఇటిక్యాలకు చెందిన మేడి గణేశ్(24), ముచ్చకుర్తి అనిల్(25) వెల్గటూర్ నుంచి రాయపట్నం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. అనిల్ అక్కడికక్కడే చనిపోగా.. గణేశ్‌ను ధర్మపురి ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. అనిల్ రామగుండం కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

image

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>

News April 16, 2026

VKB జిల్లా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి!

image

జిల్లాలో భూగర్భ జల మట్టం రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోంది. జిల్లాలో సగటున 13.9 మీటర్ల లోతుకు నీటి నిల్వలు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షపాతం తగ్గడం మరియు విచ్చలవిడిగా బోర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News April 16, 2026

MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

image

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.