News August 14, 2025
మెదక్: ‘టీచర్ల నిబద్ధతతో పాఠశాలల్లో నూతన ఉత్సాహం’

FRS విధానం అమలుతో సమయపాలనలో క్రమశిక్షణ మరింత బలపడిందని డీఈవో రాధాకిషన్ తెలిపారు. టీచర్లు సమయానికి హాజరై, పాఠశాల సమయం ముగిసే వరకు నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. FRS యాప్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను 3, 4 రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్టు DEO వెల్లడించారు. ఈ విధానం ద్వారా పాఠశాలల్లో పనితీరు, విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.
Similar News
News August 16, 2025
మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు: మంత్రి వివేక్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి మాట్లాడారు.
News August 15, 2025
మెదక్ ఇంటర్ టాపర్కు పురస్కారం

మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ టాపర్ ఉప్పరి విక్రమ్కు మంత్రి వివేక్ వెంకటస్వామి నగదు పురస్కారం అందజేశారు. చిన్నశంకరంపేట మోడల్ కళాశాలకు చెందిన విక్రమ్ ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించి పురస్కారాన్ని అందుకున్నాడు. పంద్రాగస్టు వేడుకల్లో కలెక్టర్ రాహుల్ రాజు, ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో మంత్రి వివేక్ రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. ప్రిన్సిపల్ వాణీ కుమారిని కలెక్టర్ అభినందించారు.
News August 15, 2025
మెదక్ డీపీఆర్ఓకు ఉత్తమ అవార్డు

మెదక్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి(డీపీఆర్ఓ) కే. రామచంద్ర రాజు జిల్లా ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మెదక్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఏడాదికిపైగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ పౌర సంబంధాల శాఖ అధికారిగా ఉత్తమ సేవలు అందిస్తున్నారు.