News August 14, 2025
రేపటి నుంచి ఫ్రీ బస్..

APలో రేపటి నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది. విజయవాడ PN బస్టాండ్లో సా.5 గంటల సమయంలో CM పథకాన్ని ప్రారంభిస్తారు. కాగా నాన్స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదు
Similar News
News August 16, 2025
నేడు ఝార్ఖండ్కు సీఎం రేవంత్

TG: నేడు సీఎం రేవంత్రెడ్డి ఝార్ఖండ్కు వెళ్లనున్నారు. మాజీ సీఎం శిబూ సోరెన్ 11వ రోజు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి అక్కడికి చేరుకుంటారు. శిబూ సోరెన్ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలియజేస్తారు. సోరెన్ మరణం తర్వాత ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీయనున్నారు.
News August 16, 2025
రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
News August 16, 2025
విషమంగా యువరాణి ఆరోగ్యం.. మూడేళ్లుగా ఆస్పత్రిలోనే

థాయ్లాండ్ యువరాణి బజ్రకితియాభా(46) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 2022 DECలో పెంపుడు కుక్కలకు శిక్షణ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఆమె మూడేళ్లుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె లంగ్స్, కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని రాయల్ ప్యాలెస్ తాజాగా ప్రకటించింది. బ్లడ్లో ఇన్ఫెక్షన్లూ ఉన్నట్లు చెప్పింది. ‘ప్రిన్సెస్ భా’గా పేరు పొందిన ఆమె థాయ్ రాజు మహా వజిరలాంగ్కోర్న్ ముద్దుల కుమార్తె.