News August 14, 2025
అది మన చరిత్రలో విషాదకర అధ్యాయం: మోదీ

1947లో భారత్, పాక్ విభజన సందర్భంగా జరిగిన విధ్వంసంపై PM మోదీ ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే విషాదకర అధ్యాయమైన విభజన సమయంలో అసంఖ్యాక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఊహకందని నష్టాన్ని ఎదుర్కొన్నారు. వారి ధైర్య సాహసాలను గౌరవించుకోవాల్సిన రోజు ఇది. దేశాన్ని ఐక్యంగా, సామరస్యంగా ఉంచడం మన బాధ్యత అని ఈ రోజు గుర్తు చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. #PartitionHorrorsRemembranceDay హ్యాష్ట్యాగ్ను షేర్ చేశారు.
Similar News
News August 16, 2025
రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
News August 16, 2025
విషమంగా యువరాణి ఆరోగ్యం.. మూడేళ్లుగా ఆస్పత్రిలోనే

థాయ్లాండ్ యువరాణి బజ్రకితియాభా(46) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 2022 DECలో పెంపుడు కుక్కలకు శిక్షణ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఆమె మూడేళ్లుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె లంగ్స్, కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని రాయల్ ప్యాలెస్ తాజాగా ప్రకటించింది. బ్లడ్లో ఇన్ఫెక్షన్లూ ఉన్నట్లు చెప్పింది. ‘ప్రిన్సెస్ భా’గా పేరు పొందిన ఆమె థాయ్ రాజు మహా వజిరలాంగ్కోర్న్ ముద్దుల కుమార్తె.
News August 16, 2025
కృష్ణాష్టమి రోజు ఎలా పూజ చేయాలంటే?

త్వరగా లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. చిన్నికృష్ణుడి విగ్రహం/చిత్రపటాన్ని అలంకరించుకోవాలి. కన్నయ్యకు ఆహ్వానం పలుకుతూ వరిపిండితో చిన్నికృష్ణుడి పాదముద్రలు వేసుకోవాలి. వెన్న, అటుకులు, కలకండ, నెయ్యితో చేసిన లడ్డూలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. ఈరోజు భక్తితో ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని, పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.