News August 14, 2025

గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్‌లో రాకపోకలు బంద్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
SHARE IT

Similar News

News August 16, 2025

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ‘కిన్నెరసాని’

image

ఆళ్లపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం ఉదయం రాయిపాడు గ్రామ సమీపంలో వంతెన వద్ద కిన్నెరసాని వాగు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రానికి వెళ్లే వాహనదారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు లో లెవెల్ బ్రిడ్జి దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News August 16, 2025

రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

image

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

News August 16, 2025

ఖమ్మం: ఆ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

image

చింతకాని మండలం నాగులవంచ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నాగులవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రైల్వే స్టేషన్ మూసివేతను నిరసిస్తూ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో పునరాలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.