News August 14, 2025
పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆర్&ఆర్, భూ సేకరణపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఏలూరు జిల్లాలో 5 వేలు ఎకరాలు భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1400 ఎకరాలను గుర్తించామన్నారు. భూ సేకరణ పనులు ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News April 17, 2026
పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు

రహదారి ప్రమాదాల నివారణకు అవగాహన అత్యంత ముఖ్యం అని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ తెలిపారు. దమ్మపేటలో ఈరోజు జరిగిన అర్రైవ్ అలైవ్ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు, యువత ముందుకు వచ్చి సమాజంలో రహదారి భద్రతపై చైతన్యం కల్పించాలని కోరారు. కేటీపీఎస్, బీటీపీఎస్, సింగరేణి వంటి పరిశ్రమల కారణంగా ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పటికే 38 బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టామని తెలిపారు.
News April 17, 2026
25న జరిగే పాలిసెట్కు 17 పరీక్షా కేంద్రాలు: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఈనెల 25న నిర్వహించే పాలిసెట్-2026కి మొత్తం 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వివిధ విభాగాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో పాలిసెట్పై సమీక్ష నిర్వహించారు. మొత్తం 9,413 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
News April 17, 2026
ఎరువుల అక్రమ వినియోగం జరగకుండా చూడాలి: అనకాపల్లి కలెక్టర్

రాయితీపై రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు అక్రమంగా వినియోగం కాకుండా చూడాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో అనకాపల్లి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.


