News August 14, 2025
కరీంనగర్: PACSలో నామినేటెడ్ ప్రక్రియ..?

<<17399669>>PACS<<>> పాలకవర్గాలను ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ ప్రక్రియతో భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. ఈ ప్రక్రియ పక్కనున్న APలో కొనసాగుతుంది. దీంతో ఎక్కువమంది కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. PACS పాలకవర్గాల కాలపరిమితి నేటితో ముగుస్తుంది. ఈ సాయంత్రం కల్లా ఉత్తర్వులు వెలువడే ఆకాశముంది.
Similar News
News August 16, 2025
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంపీ సతీష్

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కాకినాడ ఎంపీ సానా సతీష్ ఎంపికయ్యారు. శనివారం విజయ వాడలో ఆయన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ధ్రువీకరణ పత్రంను స్వీక రించారు. క్రికెటర్గా తన జీవితాన్ని ప్రారంభించి వ్యాపార, వాణిజ్య వ్యాప్తంగా ఎదిగి రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ రెండోసారి అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల కాకినాడ ప్రముఖులు ఆయనను అభినందించారు.
News August 16, 2025
అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. కేంద్రం ఏమందంటే?

కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలు, యువతులకు ఉచితంగా స్కూటీలను అందిస్తుందని, అప్లై చేసుకోండని జరుగుతున్న ప్రచారాన్ని ‘PIBFactCheck’ ఖండించింది. కేంద్రం ఇలాంటి ‘ఫ్రీ స్కూటీ స్కీమ్’ను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలను ఎవరైనా షేర్ చేస్తే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్స్లో చెక్ చేసి నిర్ధారించుకోవాలని సూచించింది. ఇతరులకు మీరు షేర్ చేసే ముందు నిజాన్ని తెలుసుకోవాలని కోరింది.
News August 16, 2025
ఏలూరు: గౌతు లచ్చన్నకు నివాళులర్పించిన కలెక్టర్

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారని కలెక్టర్ తెలిపారు.