News August 14, 2025
ఆపరేషన్ సింధూర్ విజయం.. పెద్దపల్లిలో తిరంగా యాత్ర

జమ్మూకాశ్మీర్ పహాల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతసైన్యం విజయవంతంగా పూర్తిచేసిన ఆపరేషన్ సింధూర్ను జాతి విజయంగా జరుపుకుంటూ PDPLలో BJP తిరంగయాత్ర నిర్వహించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొని మోదీ ప్రభుత్వ నిబద్ధతను ప్రజలకు వివరించారు.
Similar News
News August 16, 2025
HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.
News August 16, 2025
HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.
News August 16, 2025
మెదక్: అత్యధికంగా శివంపేటలో 128 మిమీ వర్షం

మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా శివంపేటలో 128 మిమీలు, నర్సాపూర్లో 108.8, కాగజ్ మద్దూర్లో 98.8, పెద్ద శంకరంపేటలో 89, బోడగట్టు ఈఎస్ఎస్ 74.5, కాళ్లకల్ 68 మిమీలు, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయింది.