News August 14, 2025

ఈసారి జగన్‌నూ ఓడిస్తాం: మంత్రి సవిత

image

AP: పులివెందుల ZPTC స్థానంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ‘పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఈ విజయానికి కష్టపడిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో జగన్‌నూ ఓడించి పులివెందుల కోటను బద్దలు కొడతాం’ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News August 16, 2025

దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య

image

హైదరాబాద్ ఉప్పల్ రామంతాపూర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడి(5)పై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశాడు. రామంతాపూర్‌కు చెందిన బాలుడు ఈ నెల 12న కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానితుడ్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బాలుడికి మాయమాటలు చెప్పి ముళ్ల పొదల్లో అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు.

News August 16, 2025

FLASH: క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.60 తగ్గి రూ.1,01,180కు చేరింది. 8 రోజుల్లో మొత్తం ₹2,130 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,750 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,26,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 16, 2025

త్వరలో కండక్టర్ ఉద్యోగాల భర్తీ?

image

TGSRTCలో త్వరలోనే కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. 1500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి RTC ప్రతిపాదనలు పంపింది. 2013 నుంచి ఈ నియామక ప్రక్రియ నిలిచిపోగా, ఏటా పెరుగుతున్న రిటైర్మెంట్లతో కండక్టర్ల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఆ బాధ్యతలు అప్పగిస్తుండటంతో, వారికీ భారం పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం అనుమతిస్తే త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.